Type Anything.., You Get World Wide Search Results Here. !

తిరుమలలో మొట్టమొదటి లడ్డును ఎప్పుడు తయారు చేశారు? మీకు తెలుసా?

తిరుమలలో మొట్టమొదటి లడ్డును ఎప్పుడు తయారు చేశారు? మీకు తెలుసా?


tirumala కోసం చిత్ర ఫలితం
తిరుపతి శ్రీవారి లడ్డూ అంటే ఇష్టపడని వారు ఉండరూ. దానికున్న ప్రత్యేకతే వేరు. మరి అంతమంది ఇష్టపడే ఈ లడ్డూ తయారీ ఇప్పటికీ 300 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ లడ్డూను మొదట ఆగష్ట్ 2, 1715 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరునికి ప్రసాదంగా తయారుచేసినట్టు అధికారులు తెలిపారు. 

tirumala laddu కోసం చిత్ర ఫలితం
తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యదిక సంపద కలిగిన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఎంత ఫేమస్సో లడ్డూ కూడా అంతే ఫేమస్సు. ఈ ఆలయానికి ఎక్కడెక్కడినుండో జనాలు వస్తుంటారు. ధన, పేద అనే తేడా లేకుండా అందరూ ఈ ఆలయానికి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ లడ్డూలను ప్రసాదంగా అందిస్తారు. 

300 గ్రాముల బరువున్న ఈ లడ్డూను రూ. 25 ధరపై విక్రయిస్తారు. సబ్సిడీ కింద ఈ లడ్డూను రూ. 10కే విక్రయిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్ధానం లెక్కల ప్రకారం 2014లో మొత్తం 9 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించారు.

Top

Bottom